శైలజానాథ్‌ సంచలన వ్యాఖ్యలు

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం చేస్తామని తెలిపారు శైలజానాథ్‌.

Update: 2021-02-06 07:31 GMT

కేంద్రాన్ని ఏమీ అడగలేని పరిస్థితిలో జగన్‌ ఉన్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. బీజేపీతో జగన్‌ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ప్రజల త్యాగాల ఫలితమైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మకానికి పెడితే సహించబోమని అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం చేస్తామని తెలిపారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి.. పోరాటానికి శ్రీకారం చుడతామని శైలజానాథ్‌ అన్నారు.


Tags:    

Similar News