వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. పార్టీ చీఫ్ చంద్రబాబు ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున హిందూపురం నుంచి బరిలోకి దిగి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. వైఎస్ జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశించి భంగపడ్డ ఇక్బాల్ గత నాలుగురోజుల క్రితం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు.
ఈ మేరకు సీఎం జగన్కు, మండలి చైర్మన్కు రాజీనామా లేఖను పంపించారు. మహ్మద్ ఇక్బాల్ నేపథ్యం పరిశీలిస్తే ఆసక్తి కలిగిస్తుంది. ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు. తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. అనంతరం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు సొంతగూడు టీడీపీకి తిరిగొచ్చారు.