వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్బుక్ ను మేయింటెనెన్స్ చేయడం కష్టమైన పని కాదని.. అయితే తాము గుడ్ బుక్ ను పెట్టి మంచి పనులు చేసే వారి పేర్లను వివరాలను నమోదు చేసుకుంటామని చెప్పారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మంగళగిరి వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తుంటాయి. కష్టాల నుంచి హీరోలు, నాయకులు పుడుతుంటారని అన్నారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని , కాలర్ ఎగురేసుకునేలా పనులు చేద్దామని కార్యకర్తల్లో ధైర్యం నింపారు.