Perni Nani : ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని ఆగ్రహం

Perni Nani : ఉద్యోగ సంఘాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పేర్నినాని. యూనియన్‌ నేతలు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Update: 2022-01-20 14:46 GMT

Perni Nani : ఉద్యోగ సంఘాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పేర్నినాని. యూనియన్‌ నేతలు ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ 27 శాతం ఐఆర్ ఇవ్వలేదన్నారు. పీఆర్సీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... . కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందనేది అవాస్తవమన్నారు. మొత్తం జీతం పెరిగిందా.. లేదా అనేది చూడాలని.... ఉద్యోగులు ఆశించన మేరకు చేయలేక పోయినందుకు బాధగానే ఉందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు మంత్రి పేర్నినాని. ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని... ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్లొద్దని తెలిపారు.

Tags:    

Similar News