Nara Lokesh: వైఎస్ జగన్‌కు 17 ప్రశ్నలు సంధించిన నారా లోకేష్‌..

Nara Lokesh: జగన్‌ సర్కార్‌ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Update: 2022-05-16 11:45 GMT

Nara Lokesh: జగన్‌ సర్కార్‌ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. మూడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ ఫైరయ్యారు.. జగన్‌ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రికి 17 ప్రశ్నలు సంధించారు నారా లోకేష్‌.. అప్పుల అనుమతి కోసం వ్యవసాయ విద్యుత్‌ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించిన నీచుడు ఎవరంటూ తీవ్రస్థాయిలో నిందిస్తూ ప్రశ్నలు సంధించారు లోకేష్‌.

మూడేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క చిన్న పిల్ల కాలువ తవ్వారా..? ఒక్క చిన్న సాగునీటి ప్రాజెక్టు కట్టారా అంటూ నిలదీశారు.. రైతుల నుంచి గత ఏడాది కొన్న ధాన్యం డబ్బులు ఇచ్చారా..? ఈ ఏడాది ధాన్యం కొన్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు.. 3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందని, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎక్కడని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు లోకేష్‌.. తుఫాన్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు.. పంటల బీమా ప్రీమియం కట్టామన్నారు..

రైతులకు ఇన్సూరెన్స్‌ వర్తించలేదెందుకని ప్రశ్నించారు. 12,500 కోట్లు రైతు భరోసా ఇస్తానని.. 7,500 ఇస్తున్నది ఎవరని లోకేష్‌ ప్రశ్నించారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులను అసలు గుర్తించారా అంటూ సూటిగానే ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులను అసలు గుర్తించారా..? వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్‌ ఇరిగేషన్‌, సూక్ష్మ పోషకాలు లాంటివి ఏమయ్యాయి..?

కేంద్రం తెచ్చిన వ్యవసాయ రంగ వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇచ్చిన మూర్ఖుడు ఎవరంటూ ఘాటైన ప్రశ్నలు సంధించారు.. ఏపీ ఎప్పుడో మర్చిపోయిన క్రాప్‌ హాలిడే మళ్లీ తీసుకొచ్చిన అసమర్థుడు ఎవరంటూ నిలదీశారు.. టీడీపీ హయాంలో రైతులకు 3 లక్షల వరకు సున్నా వడ్డీ నిబంధనను కేవలం లక్షకే పరిమితం చేసింది ఎవరు? రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉండటానికి కారకులు మీరు కాదా అంటూ డైరెక్ట్‌గానే ఎటాక్‌ చేశారు.

ఇక ముదిగొండలో 8 మంది రైతుల్ని కాల్చి చంపిన మీ నాన్నగారి చరిత్ర మరచిపోయారా..? సోంపేటలో తమ భూముల్ని లాక్కోవద్దని ఆందోళన చేసిన రైతులు ఆరుగుర్ని కాల్చి చంపించింది మీ నాన్న రాజశేఖర్‌ రెడ్డి కాదా..? రాజధాని కోసం భూములిచ్చిన రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తే టెర్రరిస్టుల్లా అమరావతి రైతులకు సంకెళ్లు వేసింది ఏ రాక్షసుడి ఆదేశాలతోనో చెప్పాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు మొత్తం 17 ప్రశ్నలు సంధించారు నారా లోకేష్‌.

Tags:    

Similar News