Nara Lokesh: జగన్‌పై నారా లోకేష్ కామెంట్స్.. ఏదీ పట్టించుకోకుండా..

Nara Lokesh: సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే పేరుతో గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు నారా లోకేష్‌.

Update: 2021-11-20 13:15 GMT

Nara Lokesh (tv5news.in)

Nara Lokesh: సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే పేరుతో గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు నారా లోకేష్‌. గాల్లోంచి నేలకు దిగితేనే జనం కష్టాలు తెలుస్తాయని మండిపడ్డారు. అకాల వర్షాలకు రాయలసీమ అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి అటు కన్నెత్తి చూడకపోవడం దారుణమన్నారు.

వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల పట్టించుకోకుండ.. క్షుద్ర రాజకీయాలు నడిపిన వైసీపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే భారీగా ప్రాణ , ఆస్తి నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో దొంగ ఓట్లపై పెట్టిన శ్రద్ధ.. వరద ముప్పు ప్రాంతాలపై పెట్టినట్లయితే బాదితులకు కనీసం సాయమైన అందేదన్నారు లోకేష్‌.

ఎడతెరపి లేని వర్షాలకు కడప జిల్లాలో 30 మంది గల్లంతవ్వగా.. 12 మంది చనిపోతే పట్టించుకునే తీరికలేని జగన్‌ ని ఏమనాలో అర్థంకావట్లేదన్నారు లోకేష్‌.గల్లంతైన వారి ఆచూకీ తెలియక బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నిరుగా విలపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో.. హుదూద్‌, తిత్లీ తుఫాన్లు వస్తే.. టీడీపీ ప్రభుత్వం బాధితులకు అండగా ఉందని గుర్తు చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు పర్యటించి బాధితులకు ఆదుకోవాలని లోకేష్‌ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News