Peddireddy on AP 3 capitals bill: అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు.. మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Peddireddy on AP 3 capitals bill: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమేనని కామెంట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

Update: 2021-11-22 07:52 GMT

Peddireddy on AP 3 capitals bill: మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ కేవలం ఇంటర్వెల్‌ మాత్రమేనని కామెంట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుభం కార్డుకు మరింత సమయం ఉందని చెప్పుకొచ్చారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశామని, తాను మాత్రం ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నానని కామెంట్ చేశారు. బిల్లుల ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదని, అమరావతి రైతుల పాదయాత్ర ఏమైనా లక్షల మందితో సాగుతోందా అంటూ ఎద్దేవా చేశారు. అది పెయిడ్‌ ఆర్టిస్టుల పాదయాత్ర అని, రైతుల పాదయాత్ర చూసి బిల్లులు ఉపసంహరించుకోలేదని చెప్పారు పెద్దిరెడ్డి.

Tags:    

Similar News