వాలంటీర్ల కోసం ప్రభుత్వం అనవసర ఖర్చు పెడుతోంది: సోము వీర్రాజు
ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలకూ ఈ వ్యవస్థ విఘాతం కలిగించిందన్నారు సోము వీర్రాజు.
310 కోట్ల రూపాయలు నెలకు వాలంటీర్ల కోసం ప్రభుత్వం అనవసర ఖర్చు పెడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.. వాలంటీర్ల కోసం పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.. నవరత్నాల కోసం ఏర్పాటైన వ్యవస్థ ఎన్నికలను నిరోదిస్తుందా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలకూ ఈ వ్యవస్థ విఘాతం కలిగించిందన్నారు సోము వీర్రాజు.