పింక్ డైమండ్ ఆరోపణలు చేసిన రమణదీక్షితులను మళ్లీ విధుల్లోకి ఎలా తీసుకుంటారు : పట్టాభి

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని అపవిత్రంగా వైసీపీ ప్రభుత్వం మార్చివేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు.

Update: 2021-04-04 07:30 GMT

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని అపవిత్రంగా వైసీపీ ప్రభుత్వం మార్చివేసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. పింక్ డైమండ్ పై ఆరోపణలు చేసిన రమణదీక్షితులను మళ్లీ విధుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తిరుపతిని పెట్టుబడులకు కేంద్రంగా తయారుచేస్తే.. వైపీపీ ప్రభుత్వం అవినీతికి కేంద్రంగా మార్చిందన్నారు. కేంద్రం బలగాలతో తిరుపతి ఉప ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలన్నారు. 

Tags:    

Similar News