ఏపీలో త్వరలో జరగనున్న లోక్ సభ (Lok sabha), శాసనసభా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్కడికి వెళ్లనున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) బాధ్యతలు చేపట్టాక ఈ నెల 25న తిరుపతి పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభకు రేవంత్ తో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరుకానున్నారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన షర్మిల తిరుపతి బహిరంగ సభకు హాజరుకావాలని ఆహ్వానించారు. తెలంగాణకు పొరుగున ఉన్న ఉభయ కృష్ణా, పశ్చిమగోదావరి, కర్నూల్, గుంటూరు జిల్లాలలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
తెలంగాణలో జరిగే పార్ల మెంట్ ఎన్నికల్లో పాల్గొంటూనే.. ఏపీలోనూ తనతో పాటు మంత్రులను ప్రచారంలో పా ల్గొనేలా చర్యలు తీసుకుంటానని షర్మిలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. వామపక్ష పార్టీల నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి. తెలిసిందే.