AP : అల్లూరి జిల్లాలో విషాదం.. నలుగురు గల్లంతు

Update: 2024-11-08 14:00 GMT

అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో విషాదం చోటుచేసుకుంది. అడ్డతీగల (మం) తిమ్మాపురం వద్ద ఏలేరు కాల్వలో ఇసుక కోసం వెళ్లి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీ పాలెంకి చెందినవారిగా గుర్తించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఏమయ్యారోనని .. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇసుకను తీసుకు వెళ్లేందుకు వచ్చి కాలువలో గల్లంతయ్యారంటూ రోదనలు మిన్నంటుతున్నాయి.

Tags:    

Similar News