Breaking : వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు

Update: 2024-03-12 05:31 GMT

వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju) అనర్హత వేటు వేశారు. పార్టీ మారిన సి.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్‌లపై వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యతో పాటు విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ యాదవ్ ఈ మధ్యే పార్టీ ఫిరాయించారు. సి రామచంద్రయ్య వైసీపీని వీడి టీడీపీలోకి ఫిరాయించగా.. వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలోకి ఫిరాయించారు. నేరుగా పార్టీ వేదికలపైనే వీరు కండువాలు కప్పుకున్నారు. దీంతో వైసీపీ వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ మండలి ఛైర్మన్ కు ఫిర్యాదులు చేసింది. . వీరిద్దరూ తమ ఎమ్మెల్సీ పదవీకాలాన్ని వదిలేసి మరీ టీడీపీ, జనసేనలోకి ఫిరాయించడం విశేషం.

Tags:    

Similar News