బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు మళ్లీ వేగవంతం అయింది. ఈ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ డ్రగ్స్ సేవించినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు.
హేమ ఎండీఎంఏ డ్రగ్ను సేవించినట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. అయితే, ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. ఒక వేయి 86 పేజీల ఛార్జ్షీట్ను బెంగళూరు పోలీసులు దాఖలు చేశారు.