పవన్ కల్యాణ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను పట్టాలెక్కించారు పవన్. కానీ పొలిటికల్ గా బిజీ కావటంతో లిస్ట్లో ముందున్న సినిమాలే ఇంకా పూర్తికాలేదు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ డిలే అవుతూ వస్తోంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఫస్ట్ హాఫ్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి మరో స్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా కోసం తన కెరీర్లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారట పవర్ స్టార్. ఇదిలా ఉండగా జూన్ రెండో వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్టు క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు హరీశ్ శంకర్. సినిమా షూటింగ్ కు త్వరలో ప్రారంభం కానుండటంతో ఆయన ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేడపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు హరీశ్ శంకర్.