వీడని బీటెక్ విద్యార్థి రాజేష్ డెత్ మిస్టరీ
వివాహేతర సంబంధం కారణంగానే రాజేష్ది హత్య అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
యువకుడు రాజేష్ డెత్ మిస్టరీ వీడటం లేదు. వివాహేతర సంబంధం కారణంగానే రాజేష్ది హత్య అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్న యువకుడు రాజేష్,.. ఈ నెల 22న పెళ్లికి వెళ్తున్నట్లు స్నేహితులతో చెప్పినట్లు తెలుస్తుంది. అయితే గత బుధవారం నుంచి ఫోన్కాల్స్ లిఫ్ట్ చేయని రాజేష్, హయత్నగర్లోని కుంట్లూరులో శవమై కన్పించాడు. మృతదేహంపై పలుచోట్ల గాయాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే హయత్నగర్కి చెందిన ప్రభుత్వ టీచర్ సుజాతతో యువకుడు రాజేష్కు వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సుజాత భర్త నాగేశ్వర్ రావుకి విషయం తెలియడంతో దంపతుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మనస్తాపంతో సుజాత పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుజాత సోమవారం మృతిచెందింది. సుజాత ఆత్మహత్యాయత్నం తర్వాత సుజాత ఇంటిచుట్టూ రాజేష్ అనుమానస్పందంగా తిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాజేష్పై సుజాత భర్త నాగేశ్వర్ రావు, కుమారుడు దాడి చేసినట్లు తెలుస్తుంది.
ఇక దాడిలో రాజేజ్ చనిపోయాడా? బాడీని కుంట్లూరులో పడేశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అటు సుజాత విషం తాగిందా? లేక భర్త బలవంతంగా తాగించాడా అనే కోణంలోనూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో యువకుడు రాజేష్, వివాహిత సుజాత మృతి మిస్టరీగా మారింది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో సుజాత మృతదేహం ఉంది. పోస్ట్మార్టం తర్వాత కుటుంబసభ్యులకు డెడ్బాడీని అప్పగించనున్నారు పోలీసులు.