Nellore: భార్య, 5 నెలల బిడ్డను చంపిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య..

Nellore: నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టణపుపాలంలో దారుణం జరిగింది.

Update: 2022-08-07 15:45 GMT

Nellore: నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టణపుపాలంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భార్య, కూతురిని చంపేసి, తాను సూసైడ్ చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ఆవరు మురళి భార్య స్వాతిపై అనుమానం పెంచుకొని ఆమెతో పాటు 5నెలల పసికందును కూడా హతమార్చాడు. భార్యభర్తల మధ్య తరుచూగొడవలు జరిగేవని, ఈ నెల 4వ తేదీన పుట్టింటిం నుంచి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. శనివారం రాత్రి కూడా భార్యభర్తల మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున భార్య పిల్లలను చంపేసిన మురళి.. ఫ్యాన్ కు ఊరేసుకున్నట్లు కావలి రూరల్ సీఐ షేక్ ఖాజావలి తెలిపారు.

Tags:    

Similar News