Amarnath Yatra : జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర

Update: 2024-05-17 06:36 GMT

ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. 53రోజులపాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుందని అమర్నాథ్ బోర్డు తెలిపింది. యాత్రకు వెళ్లే రెండు రూట్లలో 12 క్రిటికల్ స్పాట్స్‌ను గుర్తించామంది. ఈ ప్రాంతాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కూడిన మౌంటైన్ రెస్క్యూ టీమ్స్‌ ఉంటాయని తెలిపింది.

లక్షలాది మంది యాత్రికులు ఇందులో పాల్గొంటారని, యాత్రలో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా భక్తులకు సహాయం అందించేందుకు సాంబ జిల్లాలో ఎంఆర్‌టీ‌కి తగిన శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కీలక ప్రాంతాంల్లో సైనికులను మోహరిస్తామని, భక్తులకు ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనా వారు సహాయం అందిస్తారని, సరికొత్త టెక్నాలజీ, సామగ్రితో టీమ్స్‌ను సిద్ధంగా ఉంచుతున్నామని వివరించారు. భక్తులకు క్లిష్ట పరిస్థితులు ఎదురైతే సహాయం అందించేందుకు జమ్ముకాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన 1,300 మంది సిద్ధంగా ఉంటారని తెలిపింది.

Tags:    

Similar News