Seetha Ramula Kalyanam : సీతారాముల కల్యాణం.. మ.12 గంటలకే ఎందుకు?

Update: 2024-04-17 05:11 GMT

సీతారాముల కల్యాణం సరిగ్గా మ.12 గంటలకు జరుగుతుంది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో మ.12కు జన్మించినట్లు పురాణాల్లో ఉంది. ఇదే ముహూర్తాన పట్టాభిషిక్తుడవడం విశేషం. అలాగే రాముడు అవతరించిన రోజునే కల్యాణం జరిపించాలని పురాణగాథలు చెబుతున్నాయి. దీంతో రాముడి పుట్టిన సమయాన్నే వివాహ సమయంగా నిర్ణయించి ఏళ్లుగా పండితులు కల్యాణం జరిపిస్తున్నారు.

సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఉదయం 9.30 గంటలకు పెళ్లితంతు మొదలు కానుంది. ఈ వేడుకల కోసం దేవస్థానం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆర్టీసీ 238 ప్రత్యేక బస్సులను నడుపుతుండగా.. భద్రాద్రిలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో స్థానికంగా వసతి కష్టంగా మారింది.

రఘువంశ శ్రేష్ఠుడు శ్రీరాముడి జీవితం సకల జనులకు ఆదర్శప్రాయం. ఆయన నుంచి అనేక అంశాలను నేర్చుకోవచ్చు. తల్లిదండ్రుల మాట దాటని కొడుకుగా, భార్యను రక్షించుకునే గొప్ప భర్తగా, ఇచ్చిన మాట మరవని స్నేహితుడిగా, మర్యాద రాముడిగా, ఎల్లవేళలా ఓపికతో ఉండే వ్యక్తిగా, ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన రాజుగా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణాలు. భగవంతుడే స్వయంగా మానవ జన్మ ఎత్తి ఎలా బతకాలో లోకానికి చూపించారు.

Tags:    

Similar News