Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

Update: 2025-08-28 13:00 GMT

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటైన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి ఈ వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ ప్రస్తుత నీటి మట్టం 877.90 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రాజెక్టులో ప్రస్తుతం సుమారు 177.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంలో దాదాపు 80%కి సమానం.రిజర్వాయర్‌లోకి ఇన్ఫ్లో 1,51,379 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,600 క్యూసెక్కులుగా ఉంది. ఈ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలోని వర్షాధారిత ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు మరియు కృష్ణా నది నుంచి వరద ప్రవాహం పెరగడం వల్ల ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే త్వరలోనే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వరద నీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యవసాయ అవసరాలకు మరియు తాగునీటికి ఎంతో ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News