ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్ను ఇవాళ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. . పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని అక్టోబర్ 3 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డీఎస్సీలో టెట్కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.
పరీక్ష ఫీజు చెల్లింపు: ఇప్పటికే ప్రారంభం కాగా ఆగస్టు 3 వరకు అవకాశం
ఆన్లైన్ దరఖాస్తులు: ఆగస్టు 3 వరకు
ఆన్లైన్ మాక్టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి
పరీక్షలు: అక్టోబర్ 3 నుంచి 20 వరకు(2 సెషన్లలో)
ప్రొవిజినల్ కీ: అక్టోబర్ 4నుంచి
ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్ 5 నుంచి
తుది కీ విడుదల: అక్టోబర్ 27
ఫలితాలు విడుదల: నవంబర్ 2న