10 శాతం మరాఠా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం

Update: 2024-02-20 07:20 GMT

మరాఠా రిజర్వేషన్ల (Marata Reservations) కోసం సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చడంలో ఓ కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) విద్యాసంస్థలు, ప్రభుత్వ పదవుల్లో మరాఠా వర్గానికి 10% రిజర్వేషన్లు అమలు చేయడానికి ముసాయిదా బిల్లుకు పచ్చజెండా ఊపింది. ప్రతిపాదిత మరాఠా రిజర్వేషన్‌పై చర్చల నేపథ్యంలో మహారాష్ట్ర విధానసభ ప్రత్యేకంగా సమావేశమైంది.

గత వారం, ముఖ్యమంత్రి షిండే ఇతర వర్గాలకు ప్రస్తుత రిజర్వేషన్ కోటాలను మార్చకుండా మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు మంజూరు చేయడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మరాఠా రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంలో విభేదాలు తలెత్తాయి. ప్రత్యేకించి దాన్ని OBC (ఇతర వెనుకబడిన తరగతులు) కేటగిరీ కింద చేర్చడం, కుంబి కేటగిరీ కింద రిజర్వేషన్ల హామీపై సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ వ్యతిరేకత వ్యక్తం చేశారు.

Tags:    

Similar News