Tragic Incident : రిసార్ట్ పైకప్పు కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతి

Update: 2024-03-16 09:03 GMT

Uttar Pradesh : యూపీలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న రిసార్ట్ పైకప్పు మార్చి 15న రాత్రి అకస్మాత్తుగా కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. బహ్రైచ్‌లోని రూరల్ కొత్వాలి ప్రాంతంలోని బహ్రైచ్-సీతాపూర్ హైవే వెంబడి ఉన్న లేజర్ రిసార్ట్‌లో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ఎనిమిది మంది కూలీలు నిర్మాణంలో ఉన్నారు. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు కాగా, పైకప్పు కూలడంతో ఇద్దరు మృతి చెందారు.

గంటల తరబడి రెస్క్యూ ఆపరేషన్స్ తర్వాత..

గంటల కొద్దీ రెస్క్యూ ఆపరేషన్ల తర్వాత, మృతుల మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం బహ్రైచ్ మెడికల్ కాలేజీకి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో SDRF బృందాలు, చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి భారీ యంత్రాలను మోహరించాయి.

"నిర్మాణంలో ఉన్న రిసార్ట్ పైకప్పు కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మరణించారు, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి" అని బహ్రైచ్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్, రంజన్ శ్రీవాస్తవ తెలిపారు.

Tags:    

Similar News