ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. వైసీపీ నేతల దౌర్జన్యాలకు దిగుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా బలవంతంగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరపడి అరాచకాలకు ఒడిగడుతున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయిలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని వైసీపీ నేతలు అపహరించారు. పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లిపోయారు. తమ ఏజెంట్ను కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.