టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 500 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో క్రాలీ వికెట్ తీసిన అశ్విన్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్, రెండో భారతీయ క్రికెటర్ నిలిచారు. భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్ల రికార్డు అనిల్ కుంబ్లే (619) పేరిట ఉంది. అశ్విన్ 184 ఇన్నింగ్సుల్లో 500 వికెట్లు సాధించారు. అందులో 8 సార్లు 10వికెట్లు, 34 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశారు.ఈ లిస్ట్ లో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మరళీధరణ్ 800 వికెట్లతో టాప్లో ఉన్నాడు.
టెస్టు క్రికెట్లో 500 పైగా వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 800 వికెట్లు
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్) – 696*
అనిల్ కుంబ్లే (భారత్) – 619
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) – 604
గ్లెన్ మెక్గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563
కోర్ట్నీ ఆండ్రూ వాల్ష్ (వెస్టిండీస్) – 519
నాథన్ లయన్ (ఆస్ట్రేలియా) – 517*
రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 500*