CM Revanth Reddy : మోడీ భయపడి యుద్ధం ఆపేశాడు : సీఎం రేవంత్

Update: 2025-05-30 05:45 GMT

దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదు.. దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావులేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందని కొనియాడారు. హైదరాబాద్ బాచుపల్లిలో జరిగిన జైహింద్ సభలో రేవంత్ , పీసీసీ నేతలు పాల్గొన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులను పొట్టనపెట్టుకు న్నారని, సైన్యానికి మద్దతుగా జైహింద్ ర్యాలీలు నిర్వహిం చాలని ఏఐసీసీ ఆదేశించిందని, ఖర్గే, రాహుల్ ఆదేశాలతో జైహింద్ ర్యాలీ నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సీఎంగా మీముందు ఉన్నానంటే అది మల్కాజిగిరి ప్రజల చలవేనని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆపరేషన్ సిందూర్ కు మద్దతు ఇచ్చామని, ఆపరేషన్ సిందూరక్కు మద్దతుగా నెక్లెస్ రోడ్డులో ర్యాలీ చేశాని తెలిపారు. పాకిస్థాన్కు గుణపాఠం చెప్పాలని మోదీకి మద్దతు తెలిపామని, 4 రోజుల యుద్ధం తర్వాత ఏం జరిగిందో తెలియదని, యుద్ధం ఆపేశారని అన్నారు. ట్రంప్ మీడియా ముందుకు వచ్చి యుద్ధం ఆపానని ప్రకటించారని గుర్తు చేశారు. యుద్ధం ఆపే విషయంలో అఖిలపక్షంతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News