TG : ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజీని సందర్శించిన జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ బాలికల కళాశాలను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ పరిశీలించారు. కళాశాలలో వంటగది, డైనింగ్ హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని జాటోత్ హుస్సేన్ అన్నారు.