తెలంగాణ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోందని... దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందర్రావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షాకు లేఖ రాశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ ఆదేశాలతో పోలీసులు తన ఫోన్లు, బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే.. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా రఘునందన్ రావు లేఖ రాశారు.