REVANTH: బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటోంది బీజేపీనే: రేవంత్

బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. బహుజనులకు 42% రిజర్వేషన్ల కోసం 2 చట్టాలు కేంద్రానికి;

Update: 2025-08-19 04:30 GMT

తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి బీసీ రి­జ­ర్వే­ష­న్ల అం­శం­పై సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. సర్దా­ర్ సర్వా­యి పా­ప­న్న గౌడ్ జయం­తి సం­ద­ర్భం­గా ప్ర­సం­గి­స్తూ, బహు­జ­ను­ల­కు వి­ద్య, ఉపా­ధి, రా­జ­కీయ రం­గా­ల్లో 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పిం­చే­లా రెం­డు వే­ర్వే­రు చట్టా­ల­ను రూ­పొం­దిం­చి కేం­ద్రా­ని­కి పం­పా­మ­ని తె­లి­పా­రు. కానీ బీ­జే­పీ నే­తృ­త్వం­లో­ని కేం­ద్రం ఆమో­దిం­చ­క­పో­వ­డం బహు­జ­ను­ల­పై తీ­వ్ర­మైన అన్యా­యం అవు­తుం­ద­ని ఆరో­పిం­చా­రు. కు­ల­గ­ణన ఆధా­రం­గా బహు­జ­నుల సం­ఖ్య 56.33 శాతం ఉన్న­ప్ప­టి­కీ, వా­రి­కి సరి­ప­డిన రి­జ­ర్వే­ష­న్ల­ను అడ్డు­కుం­టు­న్న­ది మోదీ ప్ర­భు­త్వం, కి­ష­న్ రె­డ్డి అని వి­మ­ర్శిం­చా­రు. గతం­లో కే­సీ­ఆ­ర్ తీ­సు­కు­వ­చ్చిన చట్టం బీ­సీ­ల­కు శా­పం­గా మా­రిం­ద­ని, అం­దు­కే కొ­త్త చట్టా­న్ని ఆర్డి­నె­న్స్ రూ­పం­లో గవ­ర్న­ర్‌­కు పం­పి­తే, గవ­ర్న­ర్ రా­ష్ట్ర­ప­తి­కి పం­పా­ర­ని చె­ప్పా­రు. ఐదు నె­ల­లు గడి­చి­నా బి­ల్లు­లు ఆమో­దం పొం­ద­లే­ద­ని, అం­దు­కే ఢి­ల్లీ­లో ధర్నా చే­యా­ల్సి వచ్చిం­ద­ని గు­ర్తు చే­శా­రు. ఆ ధర్నా­కు బీ­జే­పీ, బీ­ఆ­ర్‌­ఎ­స్ రా­క­పో­వ­డం బహు­జ­నుల పట్ల వారి వై­ఖ­రి­ని చూ­పు­తుం­ద­ని మం­డి­ప­డ్డా­రు.

మతం ముసుగులో రిజర్వేషన్లు అడ్డుకోవడం తప్పు అని, నాగ్‌పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బీసీ ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేయగలరా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను శిలాశాసనమని పేర్కొన్నారు. బహుజనుల సామ్రాజ్యం కోసం, వారి ఆకాంక్షల సాధన కోసం కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. విద్య, ఉద్యోగాల ద్వారా బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకువెళ్లడం తమ బాధ్యత అని అన్నారు. అలాగే, దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో కోటి ఓట్లు అక్రమంగా నమోదు చేశారని, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. ఓటు హక్కును దోచుకున్న వారిని శిక్షించాలనే డిమాండ్‌తో రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రకు తాను, డిప్యూటీ సీఎం త్వరలో మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఓట్ల చోరీ చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News