Russia : రష్యా పర్యాటకురాలిని ఓ ఏనుగు గాలిలోకి ఎగరవేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం (ఫిబ్రవరి 13) జైపూర్లోని అమెర్ ఫోర్ట్ ప్రాంగణంలో జరిగింది. ఈ సంఘటన తర్వాత, అమెర్ ఫోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆడ ఏనుగు గౌరీ, దాని సేవలను నిషేధించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ఏనుగు మహిళను ట్రంక్తో పట్టుకుని బలంగా ఊపడం, ఆపై ఆమెను నేలకేసి కొట్టడం వంటివి కనిపిస్తున్నాయి. అంతలోనే ఏనుగు మావటి బ్యాలెన్స్ కోల్పోయింది. ఆ మహిళ నేలపై పడిపోయింది.
ఘటన తర్వాత, రష్యా పర్యాటకురాలని వైద్య చికిత్స కోసం కోట అధికారులు సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించారు. జంతు హక్కుల సంస్థ PETA ఈ సంఘటన వీడియోను మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో పంచుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రి దియా కుమారి, రాష్ట్ర అటవీ శాఖను ట్యాగ్ చేసి, ఏనుగును వన్యప్రాణుల అభయారణ్యంలోకి మార్చమని అభ్యర్థించింది.
గౌరీ వ్యక్తులపై దాడి చేయడం ఇదేం మొదటిసారి కాదు. అక్టోబరు 2023లో, ఏనుగు స్థానిక దుకాణదారుడిపై కూడా దాడి చేసింది, దీనివల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయి.