Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఈ రోజు (ఏప్రిల్ 4) నేపాల్ సరిహద్దు (Nepal Border) సమీపంలో భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురిలో ఇద్దరు పాకిస్థానీలు ఉన్నారని, నకిలీ భారతీయ గుర్తింపు రుజువులను కలిగి ఉన్నారని ATS విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
“భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే లక్ష్యంతో కొందరు ఉగ్రవాదులు ఇండో-నేపాల్ సరిహద్దు గుండా ప్రవేశించబోతున్నారని ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా గోరఖ్పూర్ ATS యూనిట్ బృందం అప్రమత్తమైంది. ఇండో-నేపాల్ సరిహద్దు గుండా భారత్లోకి ప్రవేశించిన ముగ్గురు నిందితులను యూనిట్ ఏప్రిల్ 4న అరెస్టు చేసింది” అని ప్రకటనలో పేర్కొంది.
నిందితులను పాకిస్థాన్లోని రావల్పిండి నివాసి మహ్మద్ అల్తాఫ్ భట్, ఇస్లామాబాద్కు చెందిన సయ్యద్ గజ్నాఫర్, జమ్మూ కాశ్మీర్కు చెందిన నాసిర్ అలీగా గుర్తించినట్లు తెలిపింది. మహరాజ్గంజ్ జిల్లాలోని సోనౌలీలోని ఇండో-నేపాల్ సరిహద్దులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ప్రకటన పేర్కొంది.