AP : సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతా: చంద్రబాబు
ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రావడంలో ఏమాత్రం సందేహం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే ఏపీ ఎక్కువగా నష్టపోయిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో దాదాగిరి పెరిగిందని అన్నారు. జగన్లా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని బాబు అన్నారు.
సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జీవితంలో కొందరు ఊహకు అందరు. గత ఎన్నికల్లో జగన్ను తక్కువ అంచనా వేశాం. సరిగ్గా అంచనా వేయలేకపోవడం మా వైఫల్యమే. జగన్ సీఎం అయ్యి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని ఊహించలేదు. ఇంత ప్రమాదకారి కాబట్టే.. జగన్ను వైఎస్ బెంగళూరుకే పరిమితం కామని చెప్పేవారు’ అని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com