PM Modi : సౌత్ నే నమ్ముకున్న ప్రధాని మోడీ

PM Modi : సౌత్ నే నమ్ముకున్న ప్రధాని మోడీ

అబ్ కీ బార్ చార్ సౌ అంటున్న బీజేపీ అగ్రనేతలు, ప్రధాని మోడీ దక్షిణ భారతాన్నే నమ్ముకున్నారు. ఐదో విడత పోలింగ్ కు ముందు ఇచ్చిన ఇంటర్యూల్లో ప్రధాని మోడీ ఎక్కువగా దక్షిణాది గురించి చెప్పారు. దక్షిణాదిలో తాము అత్యధిక సీట్లు సాధిస్తామని అంటున్నారు.

మోదీ మాటల్లో మర్మం.. తాము ఉత్తరాదిలో కోల్పోయే సీట్లను దక్షిణాదిలో నిలబెట్టుకుంటామనే అంటున్నారు పరిశీలకులు. మరి నిజంగా దక్షిణాదిలో బీజేపీకి అంత సానుకూలత ఉందా.. మోదీ అంచనాలు ఎందుకలా వేసుకుంటున్నారు అనేదానిపై చర్చ జరుగుతోంది.

తెలంగాణలో బీజేపీకి ఈసారి ఎనిమిది నుంచి పది సీట్లు సొంతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో మిత్రపక్షాలు టీడీపీ, జనసేనతో కలిసి 20 సీట్ల కన్నా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలో ఎన్ని సీట్లు గెలుస్తారనేది చూడాలి. కేరళలో, తమిళనాడులోనూ మంచి నంబర్స్ వస్తాయని భావిస్తున్నారు. నార్త్ లో కోల్పోయిన సీట్లు తెలుగు రాష్ట్రాల్లో వస్తాయనేది మోడీ ఆశగా తెలుస్తోంది.

Tags

Next Story