AP Polling Percentage : ఏపీలో పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన

Update: 2024-05-15 04:52 GMT

సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 80.66% పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07%ను కలిపితే మొత్తం పోలింగ్ 81.73%గా ఉండొచ్చని ప్రాథమిక అంచనా. పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్‌ జరగడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 72.63%, 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోస్టల్‌ బ్యాలట్‌ కలిపి పోలింగ్‌ నమోదైంది. ఆ లెక్కన చూస్తే ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి 2009తో పోలిస్తే 9.74%, 2014తో పోలిస్తే 3.47%, 2019తో పోలిస్తే 2.57% మేర అధికంగా ఓటింగ్‌ జరిగింది.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం

*అల్లూరి- 70.20

*అనకాపల్లి- 83.84

*అనంతపురం- 79.25

*అన్నమయ్య- 76.23

*బాపట్ల- 84.98

*చిత్తూరు- 82.65

*డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ- 83.91

*ఈస్ట్ గోదావరి- 80.94

*ఏలూరు- 83.55

*గుంటూరు- 78.81

*కాకినాడ- 80.31

*కృష్ణా- 84.05

*కర్నూలు- 75.83

*నంద్యాల- 80.92

*ఎన్టీఆర్- 79.68

పల్నాడు- 85.65

*పార్వతీపురం- 77.10

*ప్రకాశం- 87.09

*నెల్లూరు- 78.10

*సత్యసాయి- 82.77

*శ్రీకాకుళం- 76.07

*తిరుపతి- 77.82

*విశాఖ- 68.63

*విజయనగరం- 81.34

*వెస్ట్ గోదావరి- 82.70

*వైఎస్సార్- 79.40

Tags:    

Similar News