Balakrishna: భావి తరాల భవిష్యత్ కోసం చంద్రబాబు ఆలోచిస్తారు: బాలకృష్ణ

Balakrishna: వైసీపీ ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్ని మింగుతోందని ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Update: 2022-05-28 14:01 GMT

Balakrishna: వైసీపీ ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్ని మింగుతోందని ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడేళ్లలో విద్యుత్, పెట్రోల్, డీజీల్ రేట్లను జగన్ సర్కారు భారీగా పెంచిందని ఆరోపించారు. భావి తరాల భవిష్యత్ కోసం చంద్రబాబు ఆలోచిస్తారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్ అన్నారు. మహానాడుకు పసుపు సైన్యం మనం, మనం.. జనం, జనం అంటూ ఓ ప్రభంజనంలా తరలివచ్చారని చెప్పారు. పేదోడికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని తపించిన ఎన్టీఆర్.. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని బాలకృష్ణ తెలిపారు. 

Tags:    

Similar News