ఏపీలో కొత్తగా 6923 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. కొత్తగా 6923 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

Update: 2020-09-28 01:32 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు చేసిన పరీక్షల్లో కొత్తగా 6923 మందికి కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 675674కు పెరిగిందని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే, మొత్తం కేసుల్లో 605090 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా రాష్ట్రంలో 64876 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 45 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5708కు చేరింది. 

Tags:    

Similar News