JC Prabhakar Reddy : చంద్రబాబుని సీఎంగా చేసుకుంటేనే ఏపీ బాగుపడుతుంది: జేసీ ప్రభాకర్ రెడ్డి
JC Prabhakar Reddy : టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఇకపై సహించేది లేదని, తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
JC Prabhakar Reddy : టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఇకపై సహించేది లేదని, తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలంలో కార్యకర్తలతో సమావేశమైన జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీసులు, ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కష్టపడితే.. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రజల కష్టాలు అప్పుడే తీరతాయని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, చంద్రబాబుని సీఎంగా చేసుకుంటేనే ఏపీ బాగుపడుతుందని అన్నారు.