YS Jagan : మెట్లమార్గంలో జగన్ సంతకం చేసి వెళ్లాలి.. పయ్యావుల డిమాండ్

Update: 2024-09-26 11:30 GMT

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటం, అపచారం జరగటం నిజమని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని వైసీపీని హెచ్చరించారు. తప్పులను సరిదిద్దుకునే సమయంలో వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. మీరు చేసిన పాపాలు చాలనీ..భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. పాలకుడి మార్పుతో ప్రతి రంగంలో మార్పు మొదలైందని తెలిపింది. జగన్‌ ఇకనైనా రాజకీయాలు మానుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. మెట్ల మార్గంలో తిరుమల వెళ్తే కింద సంతకం పెట్టి వెళ్లండి అని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పయ్యావుల కేశవ్ సూచించారు.

Tags:    

Similar News