Chandrababu : ఒక్క ఛాన్స్ అని చెప్పిన జగన్ అరాచకాలకు తెరలేపాడు : చంద్రబాబు
Chandrababu : ఒక్క ఛాన్స్ అని చెప్పిన జగన్ ఆరాచకాలకు తెరలేపాడని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.;
Chandrababu (tv5news.in)
Chandrababu : ఒక్క ఛాన్స్ అని చెప్పిన జగన్ ఆరాచకాలకు తెరలేపాడని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, తొందరలోనే ప్రజలు బుద్దిచెప్పి గద్దె దించుతారన్నారు. మొదటి రెండు రోజులు గుడుపల్లి, శాంతిపురం, కుప్పం మండలాల్లో విస్తృతంగా పర్యటించిన చంద్రబాబు.. మూడో రోజు పార్టీ శ్రేణులకే కేటాయించారు. టీడీపీ కోర్ కమిటీ, ఏరియా కమిటీ, నాయకులతో సమావేశమైన టీడీపీ అధినేత... అటు తర్వాత వాణి మహల్ చేరుకుని యువతతో భేటీ అయ్యారు. భవిష్యత్తులో కష్టపడిన కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.