Jewelry Shop : జ్యువెలరీ షాపులో కాల్పులు, ఇద్దరికి గాయాలు

Update: 2024-03-14 08:00 GMT

బెంగళూరులోని (Bengaluru) కొడిగేహళ్లి ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరపడంతో ఇద్దరు గాయపడ్డారు. ఈరోజు తెల్లవారుజామున 11 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు దేవీనగర్‌లోని లక్ష్మీ జువెలర్స్‌లోని నగల దుకాణంలో చోరీకి యత్నించిన సంఘటన జరిగింది.

జ్యూయలరీ దుకాణం యజమాని డబ్బులు ఇవ్వకుండా అడ్డుకోవడంతో దుండగులు కాల్పులు జరిపాడు. దీంతో అతడితోపాటు సిబ్బందికి గాయాలయ్యాయి. మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపారని, నగల దుకాణం యజమానిని హత్య చేసేందుకు నిందితులు కిరాయికి తీసుకున్నారని పోలీసులు తెలిపారు.

ఇప్పటి వరకు నగల దుకాణంలో ఎలాంటి చోరీ జరిగినట్లు గుర్తించలేదు.

కాల్పులు జరిపిన వ్యక్తులు బైక్‌పై పారిపోతున్న దృశ్యాలు ఒక వీడియోలో కనిపించాయి. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు కాల్పుల్లో గాయపడిన అప్పురం, ఆనందరామ్‌లు ఆసుపత్రి పాలయ్యారు.

Tags:    

Similar News