Srisailam Temple : శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భక్తుల కోసం ఈవీ ప్రత్యేక ఏర్పాట్లు

Update: 2024-05-31 10:43 GMT

శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండడం ఓవైపు.. మరోవైపు ఇంటర్ డిగ్రీ టెన్త్ విద్యార్థులు పరీక్షల ఫలితాలు విలువడడంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి తరలివస్తున్నారు. దీంతో.. క్షేత్రం మొత్తం ఎటు చూసినా వాహనాలతో సందడి వాతావరణం నెలకొంది.

శ్రీశైలంలో భక్తులు రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంతా భక్తజనంతో సందడిగా మారింది. భక్తులు తెల్లవారుజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. మరోపక్క భక్తులు శ్రీస్వామి అమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు,అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.

Tags:    

Similar News