తిరుమలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. నేటి షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం బషీర్ బాగ్ లోని పరిశ్రమల భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళతారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, పెట్టుబడులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
ఈ మీటింగ్ తర్వాత సాయంత్రం లేదా రాత్రి టైంలో రేవంత్ తిరుమలకు వెళ్తారు. తిరుపతి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఛాన్స్ ఉంది. తిరుమలకు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ వెళతారా ? లేదా అనేది తెలియాల్సి ఉంది.
గంగమ్మ జాతర, బ్రహ్మోత్సవాలు, రద్దీ తర్వాత.. తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభం అయ్యాయి.