చంద్రబాబు నాయుడు ఆలోచనతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్: మంత్రి రామ్మోహన్ నాయుడు

Update: 2024-08-10 07:30 GMT

చంద్రబాబు నాయుడు ఆలోచనతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించబడిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ జీఎంఆర్ అరేనాలో 2nd ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ – 2024 కార్యక్రమంలో మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ పేరుతో ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 11 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ లో భాగంగా 10K రన్ ను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 10K రన్ లో అన్ని విభాగాల ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్టొన్నారు. ఏక్ పేడ్ మా కే నామ్ లో భాగంగా మంత్రి మొక్కను నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సెంట్రల్ మినిస్టర్ అయ్యాక హైదరాబాద్ లో తొలి ఈవెంట్ కు హాజరయ్యాను.. ఇది నాకు మర్చిపోని రోజన్నారు. 2014 కు ముందు తరువాత ఏవియేషన్ లో అనేక వచ్చాయన్నారు. చంద్రబాబు నాయుడు ఆలోచనతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించబడిందన్నారు.

Tags:    

Similar News