తెలంగాణలో మందుబాబులకు ఎమ్మెల్సీ ఎన్నికలు మరో షాకివ్వబోతున్నాయి. రాష్ట్రంలో 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ -ఎన్నికల పోలింగ్ కి సర్వం సిద్ధమైంది. దీంతో మే 27న వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలోని పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్ జరిగే 3 జిల్లాల్లో కూడా వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేసే విధంగా ఆదేశాలను జారీ చేశారు.
ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో మే 25 శనివారం సాయంత్రం 4.00 గంటల నుండి సోమవారం 27 సాయంత్రం 4.00 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కాబోతున్నాయి. పోలింగ్ రోజు సాయంత్రం తిరిగి తెరుచుకోనున్నాయి.