11 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేందుకు టీడీపీ (TDP) సిద్ధమైనట్లు సమాచారం. పొత్తులో భాగంగాటీడీపీకి 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 లోక్సభ సీట్లు కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 16 మంది పేర్లను వెల్లడించాల్సి ఉంది. లోక్సభ అభ్యర్థుల్లో ఒక్కరినీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం.
ఎంపీ అభ్యర్థులు వీరేనా?
శ్రీకాకుళం-రామ్మోహన్ నాయుడు
విజయనగరం-అశోక్ గజపతిరాజు
విశాఖ-భరత్
విజయవాడ- కేశినేని చిన్ని
గుంటూరు-పెమ్మసాని చంద్రశేఖర్
నర్సరావుపేట-లావు శ్రీకృష్ణదేవరాయలు
ఒంగోలు- మాగుంట రాఘవరెడ్డి
నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
అనంతపురం-JC పవన్
హిందూపురం-పార్థసారధి
నంద్యాల-బైరెడ్డి శబరి