Chandrababu: జగన్‌ సర్కార్‌ మూడేళ్ల పాలనపై చంద్రబాబు విమర్శలు..

Chandrababu: జగన్ సర్కార్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.;

Update: 2022-06-03 11:15 GMT

Chandrababu: జగన్ సర్కార్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదని టెండర్‌లో నిబంధన పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉందని.. దీనికి ముఖ్యమంత్రి సిగ్గుపడాలన్నారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్‌లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.

కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల టెండర్‌లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్ర పరువు తీశాయన్నారు. తాము చేసిన పనిలో బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లవద్దనే నిబంధన పెట్టడం దేశంలో మరే రాష్ట్రంలోనూ ఉండి ఉండదన్నారు చంద్రబాబు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు లేదనే నిబంధన.. పెట్టే హక్కు అసలు మీకు ఎక్కడ ఉందని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్రంలో లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్.. కాంట్రాక్టర్లపై, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదన్నారు.

ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా నిర్మాణ, వ్యాపార, సేవల రంగంలో లక్షల మంది ఉపాధి కోల్పోవడానికి జగన్ కారణం అయ్యారని విమర్శించారు. 13 కోట్ల పనులకు ధైర్యంగా టెండర్లు పిలవలేని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా..? ఎయిర్ పోర్ట్‌లు, స్టీల్ ప్లాంట్లు నిర్మిస్తుందా..? మూడు రాజధానుల కడుతుందా..? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News