AP : మోడీని ఎలా విమర్శిస్తారు.. బొత్సకు పురంధేశ్వరి కౌంటర్

Update: 2024-05-09 09:29 GMT

దేశ ప్రధాననమంత్రి నరేంద్రమోడీ తన పదవికి విలువ లేకుండా చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. మంత్రి బొత్స చేసిన కామెంట్స్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంటూ పురందేశ్వరి విమర్శించారు. అవినీతిపరులకు లోకమంతా అవినీతిమయంగానే కనిపిస్తుందనీ.. మీరు చేసిన ఫోక్స్‌ వ్యాగన్‌ స్కామ్‌ను ప్రజలు ఇంకా ఏమీ మర్చిపోలేదంటూ పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీ బీజేపీనే అంటూ మంత్రి బొత్స మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు పురందేశ్వరి.

విశాఖకు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ను ఇస్తే... రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోలేకపోయిందని విమర్శించారు. పసలేని ఆరోపణలు చేయొద్దని బొత్సకు హితవు పలికారు. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఆమె అన్నారు.

Tags:    

Similar News