ఏపీ ఎన్నికల ఫలితాలపై స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం మేరకు వైసీపీ ఈ సారి 123 స్థానాలతో గెలుస్తుందన్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. తాను ఎక్కువగా రాజకీయ విషయాలు చర్చించే వ్యక్తి ఈసారి జగన్ కు 159 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారని తెలిపారు. అయితే, ఆ వ్యక్తి చెప్పిన విషయాలను తాను స్వయంగా ఆలోచించి, స్పష్టత తెచ్చుకున్న తర్వాత జగన్ పార్టీకి 123 స్థానాలు వస్తాయని అనుకుంటున్నానని వెల్లడించారు. ఆ వ్యక్తి అంచనా మేరకు ఈసారి హిందూపురంలో కూడా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటుందని భావిస్తున్నామని పరిపూర్ణానంద స్వామి అన్నారు.