ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో జనసేనకు 6 మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్ను డిప్యూటీ సీఎం పదవి వరించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేనానితోపాటు మరో ఐదుగురికి మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. మంత్రి పదవుల రేసులో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేశ్, బుద్ధ ప్రసాద్, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం.
జనసేనానికి హోం శాఖ వస్తుందని క్యాడర్ భావిస్తున్న వేళ పవన్ తన ఆసక్తిని వెల్లడించారు. తనకు పర్యావరణ కాలుష్య నివారణపై పని చేయాలని ఉందని ఇండియా టుడేతో చెప్పారు. అటు వ్యవసాయం, రైతులకు సహకరించే ఇరిగేషన్ వంటివి ఇంట్రస్ట్ అని వెల్లడించారు. మరి కేబినెట్ కూర్పులో సారథికి ఏ పదవి దక్కుతుందో చూడాలి.
ఇక చంద్రబాబు కేబినెట్లో టీడీపీ నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అచ్చెన్నాయుడు, కూన రవి, కోండ్రు మురళి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస్, అయ్యన్న, పల్లా శ్రీనివాస్, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని, రఘు రామకృష్ణం రాజు, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, ఆనం, పరిటాల సునీత, అఖిలప్రియ, గౌరు చరిత సహా పలువురు రేసులో ఉన్నారు.