చిట్టి న్యూస్

మెదక్‌ నుంచే BRSపై యుద్ధం : ఈటల

కేసీఆర్‌ జూటా మాటలు మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. తెలంగాణలో సంపదకు కొదలేదన్నారు... అయితే సంపద ఎటుపోయిందో కేసీఆర్‌ చెప్పాలన్నారు.  మెదక్‌ రాందాస్‌ చౌరస్తాలో...డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం చేసిన ధర్నా, ర్యాలీలో....ఆయన పాల్గొన్నారు. మెదక్‌ నుంచి బీఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలు పెడుతున్నట్టు ఈటల ప్రకటించారు. మూడు లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసి.... కేవలం లక్ష మాత్రమే నిర్మించారని అన్నారు. నిజాంపేట్‌ జెడ్పీటీసీ విజయ్‌కుమార్‌ ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. 

వంశధార ప్రాజెక్ట్‌ను పరిశీలించిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా హీర మండలంలోని వంశధార ప్రాజెక్ట్‌ను చంద్రబాబు పరిశీలించారు. జిల్లా టీడీపీ నాయకులతో కలిసి వంశాధార- నాగావళి హైలెవల్‌ కాలువను పరిశీలించారు. టీడీపీ హయాంలో చేపట్టి పనులు.... వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేపడుతున్న పనుల తీరును పరిశీలించారు. కొత్తూరు మండలం గూనభద్రలో ప్రాజెక్ట్‌ నిర్వాసితులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.  

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సబ్ స్టేషన్ ఆపరేటర్‌పై దాడి

ఏపీ వైసీపీ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. చేతిలో అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిడిగల్లు సబ్ స్టేషన్ ఆపరేటర్ బెల్లంకొండ శ్రీనివాసులు పై నిడిగల్లు వైసీపీ సర్పంచ్ భర్త శ్రీనివాసులు రెడ్డి దాడికి పాల్పడ్డాడు. పై అధికారుల ఆదేశాలతో ఆపరేటర్ శ్రీనివాసులు విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. నా గ్రామంలో కరెంటు ఆపుతావా అంటూ మద్యం మత్తులో ఆపరేటర్ శ్రీనివాసులపై దాడి చేశాడు. అనంతరం సబ్ స్టేషన్‌కు తాళాలు వేశాడు.

గృహలక్ష్మి పథకం.. మరింత సమయం ఇవ్వాలంటున్న ప్రజలు

సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గృహ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రజలకు సూచించింది. అయితే... ఈ పథకం దరఖాస్తులు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇవాళే చివరి రోజు కావడంతో.. మరింత సమయం కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.   

హైదరాబాద్‌లో టికెట్ల కోసం కాంగ్రెస్‌ నేతల సిగపట్లు

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ టికెట్‌పై కన్నేసిన అజారుద్దీన్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా..ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆయన్ని అడ్డుకున్నారు విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు. మరోవైపు ముషీరాబాద్‌లో అంజన్‌కుమార్‌ వర్సెస్‌ సంగిశెట్టి జగదీశ్వరరావు అన్నట్లు ఉంది పరిస్ధితి. ఈసారి టికెట్‌ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు సంగిశెట్టి. అటు సనత్‌నగర్‌ టికెట్‌ రేసులో మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి ఉండగా సనత్‌నగర్‌ టికెట్‌ తనకే అంటున్నారు కోటా నీలిమ. గోషామహల్‌ టికెట్‌పైనా నేతల హోరాహోరీ ప్రచారాలు చేసుకుంటున్నారు.

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై సర్కార్ మొండి వైఖరి

వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులపై మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని ఏపీ విద్యుత్తు ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ రంగంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆగస్టు 17వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్ట్రగుల్ కమిటీ నాయకులు హెచ్చరించారు.

గృహలక్ష్మి దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో

గృహలక్ష్మి దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో తెలియక ప్రజల అవస్థలు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో గృహలక్ష్మి దరఖాస్తులు GHMC ఇవ్వాలని సర్కారు చెప్పింది. అయితే.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది మాత్రం.... MRO ఆఫీస్ కు వెళ్ళాలంటు సలహాలు ఇస్తున్నారు. అక్కడనుంచి ఎమ్మార్వో ఆఫీసుకు వెళితే... అక్కడి రెవెన్యూ అధికారులు మాత్రం... జీహెచ్ఎంసీలో ఇవ్వాలంటూ చెబుతున్నారు. దీంతో... దరఖాస్తు పత్రాలు పట్టుకొని అటు GHMC, ఇటు MRO ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు.

వైసీపీ అండతో పట్టపగలే కబేళాలకు గోవులు

విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి సమీపంలో మూడు లారీల్లో కబేలాలకు తరలిస్తున్న ఆవులను ఏపీ హిందూ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వ అండదండలతో పట్టపగలే విచ్చలవిడిగా కబేళాలకు తరలిస్తున్నారని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్పారంటూ నోటీసులు

లోక్ సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అపద్దాలు చెప్పారంటూ స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది బీఆర్‌ఎస్‌. దూబే ఉద్దేశ పూర్వకంగా సభను తప్పుదారి పట్టించారన్నారు. రూల్ 222 కింద ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. నిన్న లోక్ సభలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం 86 వేల కోట్లు ఇచ్చిందని ప్రకటించారు నిషికాంత్ దూబే. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని.. సభను తప్పుదోవ పట్టించడమేనంటూ నోటీసులో పేర్కొన్నారు నామా

అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో పెరిగిన అసంతృప్తులు

అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో అసంతృప్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కొందరు నేతలైతే ఏకంగా హైకమాండ్‌కు డెడ్‌లైన్‌ పెడుతున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పార్టీ మారుతామంటూ సంకేతాలు పంపుతున్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గులాబీబాస్‌ నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల జాబితా సిద్ధం చేస్తున్నారు. పార్టీ వీడే నేతల ప్రభావం ఎంత ఉంటుందన్న అంశంపై సర్వేలు కూడా చేయిస్తున్నారట. మరోవైపు ఎంతమంది పార్టీ వీడితే.. అంతమందిని వేరే పార్టీల నుంచి చేర్చుకునేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతను మంత్రులు, సీనియర్లకు అప్పగించారు. 

Hyderabad: ఛాయ్ విత్ అజర్ భాయ్ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్‌లో మాజీ క్రికెటర్ అజరుద్దీన్ చిచ్చు కాక రేపుతోంది. బుధవారం చేపట్టిన ఛాయ్ విత్ అజర్ భాయ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు దాదాపు రెండు గంటల పాటు అజరద్దీన్‌ను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేత భవానీశంకర్‌, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జ్ చేసేదాక వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. చివరికి కార్యక్రమంలో పాల్గొనకుండానే అజరుద్దీన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్‌ మీద విష్ణువర్ధన్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. దీంతో అజరుద్దీన్‌ తీరుపై విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా జూబ్లీహిల్స్‌లో అజరుద్దీన్ ఎలా పర్యటిస్తారని ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై అజరుద్దీన్ కన్ను వేస్తే ఖబర్దార్ అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు హెచ్చరించారు.

టీఎస్‌పీఎస్సీ వద్ద హై టెన్షన్‌

టీఎస్‌పీఎస్సీ వద్ద హై టెన్షన్‌ నెలకొంది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వార్నింగ్‌ ఇచ్చారు. ఆందోళన ఆపేయకుంటే అరెస్ట్‌ చేస్తామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. అందర్నీ అరెస్ట్‌ చేస్తామని.. మిమ్మల్ని అరెస్ట్‌ చేయడం తమకు పెద్ద పనేం కాదన్నారు. శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని కోదండరాం కోరితే గంట పర్మిషన్‌ ఇచ్చామని డీసీపీ తెలిపారు. మూడు గంటలుగా అభ్యర్ధులు ఆందోళన చేస్తున్నారు.

అయినప్పటికీ టీఎస్‌పీఎస్సీ దగ్గర అభ్యర్థుల ఆందోళన కొనసాగుతోంది. ఒకేసారి టీఎస్‌పీఎస్సీ ముట్టడికి వందల మంది అభ్యర్థులు వచ్చారు. టీఎస్‌పీఎస్సీ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బైఠాయించారు. గ్రూప్‌ 2 పరీక్ష రెండు నెలలు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేసేంతవరకు అక్కడి నుంచి కదిలేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్‌ 2 అభ్యర్థులకు మద్దతుగా అక్కడికి తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌ అక్కడికి వచ్చారు. విద్యార్ధుల్ని అరెస్ట్ చేసి గోషామహల్ గ్రౌండ్ కు తరలించారు పోలీసులు

అనంతపురంలో జనసేన, వామపక్షాల నేతల ఆందోళన

అనంత సెబ్ సిబ్బందిపై వైసీపీ దాడి చేయడం సంచలనంగా మారింది. వైసీపీ దాడులను నిరసిస్తూ.. అనంతపురంలో జనసేన, వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. సెబ్ సిబ్బందిపై దాడి చేసిన నిందితుల్ని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు జనసేన, వామపక్షనేతలు. అనంతపురంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న విపక్షాలు పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తుంటే జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వైసీపీ కార్పొరేటర్ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.  

కర్నూలు ఓల్డ్ సిటీలో ఎన్‌ఐఏ దాడులు

కర్నూలు ఓల్డ్ సిటీలో NIA దాడులు జరిగాయి. తెల్లవారుజామున అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నిషేధిత PFI సంస్థతో లింకులు ఉన్న అనుమానితుల ఇళ్లపై దాడులు జరిపారు. అబ్దుల్ మావియా, అబ్దుల్లా ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకుని పోలీస్ గెస్ట్ హౌస్‌లో విచారిస్తున్నారు. గతంలో ఓల్డ్ సిటీలోనే PFI తో లింకులున్న అబ్దుల్ వారిష్‌ను NIA అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

Vishakha: పవన్‌ వారాహియాత్రకు అడుగడుగునా ఆంక్షలు

విశాఖలో పవన్‌ కళ్యాణ్‌ వారాహియాత్రకు అడుగడుగునా ఆంక్షలు విధించారు పోలీసులు.ఎయిర్‌పోర్టులోకి జనసేన నేతలకు అనుమతి నిరాకరించారు.స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.విశాఖ నగరంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా..ఎయిర్‌పోర్ట్ నుంచి పోర్ట్‌ రోడ్‌లో వెళ్లాలని సూచించారు. అయితే పోలీసుల నిర్ణయంపై జనసైనికులు మండిపడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్ తాటి చెట్ల పాలెం మీదుగా..సిటీలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం తాము చెప్పిన రూట్ లోనే వెళ్ళాలని పట్టు పడుతుంటే కుదరదంటున్నారు జనసేన నాయకులు.  

నిజామాబాద్‌ ప్రజల్ని కేటీఆర్‌ మరోసారి మోసం చేశారు- ఎంపీ అర్వింద్

బీఆర్ఎస్‌ సర్కారుపై మండిపడ్డారు ఎంపీ అర్వింద్. మద్యం టెండర్లకు 15 రోజులు కేటాయించిన ప్రభుత్వం గృహలక్ష్మికి కేవలం 3 రోజుల కేటాయిస్తారా అంటూ మండిపడ్డారు. నిజామాబాద్‌ ప్రజల్ని కేటీఆర్‌ మరోసారి మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. నిన్న కేటీఆర్‌ మోసపూరిత వాగ్దానాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రీకొడుకుల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నిజామాబాద్‌ ఐటీ హబ్‌ ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు అర్వింద్‌

Nizamabad: చదువుకున్న కళాశాలకు పునర్వైభవం; ప్రత్యేక భవన నిర్మాణం

పుట్టిన ఊరికి.. చదివిన బడికి ఏదో ఒక ఉపకారం చేయాలంటారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమకు తోచిన సహాయం చేస్తుంటారు. ఇదే కోవకు చెందుతారు అందె ప్రతాప్ రెడ్డి. తాను చదువుకున్న కళాశాల కోసం రెండున్నర కోట్లతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు.

అందె ప్రతాప్ రెడ్డి... బాలాజీ ఏమైన్స్ లిమిటెడ్ అధినేత. ఒకప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. చిన్న తనంలో ప్రభుత్వ సాంఘీక సంక్షేమ పాఠశాల కళాశాలలో విద్యాబ్యాసం చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నీక్ కాలేజీ లో 1969 లో సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశారు. 1989లో కెమికల్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగారు. చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ కలిగిన ప్రతాప్ రెడ్డి సమాజానికి ఏదో ఒకటి చేయాలని నిత్యం పరితపించేవాడు. ఓ వైపు వ్యాపారంలో రాణిస్తూనే మరో వైపు సమాజ హితం కోసం దృష్టిసారించసాగారు. 2018 లో ప్రొడక్ట్ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు.

నిజామాబాద్ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థులతో ఏర్పడిన ఆలూమిని అసోసియేషన్ లోనూ అందె ప్రతాప్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. బాలాజీ ఏమైన్స్ CSR ఫండ్స్ ద్వారా ప్రత్యేక భవన నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. రెండున్నర కోట్ల వ్యయంతో కేవలం 6 నెలల్లోనే నార్త్ బ్లాక్ నిర్మాణం పూర్తి చేశారు. కేవలం బిల్డింగ్ మాత్రమే కాకుండా అందులో ఫర్నిచర్ కూడా సమకూర్చడం విశేషం. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేని సమయంలో సుమారు 2 వందల మంది విద్యార్థులకు ఈ భవనం ఎంతగానో ఉపయోగకరంగా మారింది. నార్త్ బ్లాక్ దాత ప్రతాప్ రెడ్డి ని పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు అభినందిస్తు న్నారు. ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించారు. తాను చదివిన ఈ కాలేజి కొత్త భవనం నిర్మించి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రతాప్ రెడ్డి.

కాలేజి కోసం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రతాప్ రెడ్డి సహకారం మారువలేనిదని తోటి పూర్వ విద్యార్థులు, కాలేజి నిర్వాహకులు చెప్తున్నారు. పేద విద్యార్థుల చదువు ప్రతాప్ రెడ్డి తోడ్పాటు ఇస్తున్నారని వారు తెలిపారు.

AP: జగన్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన

ఏపీ వ్యాప్తంగా జగన్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలకు దిగింది. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించారంటూ మండిపడుతున్న బీజేపీ నేతలు... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అటు విజయవాడ ధర్నా చౌక్‌కు భారీగా పెద్దసంఖ్యలో బీజేపీ నేతలు చేరుకున్నారు. బీజేపీ నేతలతో పాటు సర్పంచ్ సైతం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ ల వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ ధర్నా చేస్తున్నారు. 

శిలాఫలకం నిర్మించకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం


మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని 9వ వార్డులో రూ.2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న దోబీ ఘాట్ పనుల శంకుస్థాపనకు వచ్చారు. అక్కడి సీన్ చూసి ఒక్కసారిగా ఖంగు తిన్నారు. శిలాఫలకం నిర్మించకపోవడంతో మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం లేకుండా శంకుస్ధాపన ఏంటి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీమంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో శిరివెళ్ల మండలంలోని 40 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన అఖిలప్రియ.. జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు టీడీపీకి అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జడ్‌ప్లస్ కేటగిరి భద్రత కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబుపై నీచ రాజకీయాలు చేస్తూ కేసులు పెట్టే దుస్థితికి వైసీపీ నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు.  

పోలీస్ సిబ్బందిపై దాడి.. బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు

అనంతపురం సెబ్ పోలీస్ సిబ్బందిపై దాడి కేసులో... కేవలం బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ నేతల ఒత్తిళ్లతో.. బెయిలబుల్ కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. కేసును వీక్ చేసేందుకు డిప్యూటీ మేయర్, వైసీపీ నేతలు మంత్రాగం నడిపినట్లు తెలుస్తోది. కానిస్టేబుల్ రాధమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో.. కేసు నమోదు చేశారు. అయితే.. ఈ దాడి కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాల్సి ఉండగా... కేవలం బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 

కరెంట్ ఆఫీసుల వద్ద స్ధానికులు ఆందోళన

సత్య సాయి జిల్లా ధర్మవరంలోని మార్కెట్ స్ట్రీట్ వద్ద కరెంటు లేక కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో దోమలు కుట్టి పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి అంటూ కరెంట్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. తమకు గతంలో వంద రూపాయలు వస్తున్న కరెంట్ బిల్లు ఇప్పుడు దాదాపు 360 రూపాయలు వస్తున్న చెల్లిస్తున్నాం.. మాకెందుకు విద్యుత్ సరఫరా చేయలేదని ఆఫీస్ బయట ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులు మాకు కరెంట్ ఇవ్వాలని ఆఫీస్ ముందు బైఠాయించారు.

L&T కే విమానాశ్రయ మెట్రో ప్రాజెక్టు!?

విమానశ్రయ మెట్రో ప్రాజెక్టు టెండర్ ఎల్ అండ్ టీ సంస్థకే ఖరారైనట్లు తెలుస్తోంది. రెండో దశకు గ్లోబల్‌ టెండర్లు పిలవగా ఎల్‌ అండ్‌ టీ లిమిటెడ్‌, ఎన్‌సీసీ లిమిటెడ్‌ మాత్రమే పోటీపడ్డాయి. గత నెల రోజులుగా మెట్రో అధికారులు, జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ కలిసి ప్రాజెక్టు అమలులో ఆ రెండు కంపెనీల అనుభవం, సాంకేతిక, ఆర్థిక నివేదికలు, పత్రాలను అధ్యయనం చేశారు. మెట్రో నిబంధనల్లో తొలిసారిగా పొందుపర్చిన ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌లో అనుభవం, అర్హత ఉన్న ఎల్‌ అండ్‌ టీకే టెండర్‌ ఖరారైనట్లు సమాచారం.

అక్రమ కేసులు పెట్టారని ఆత్మహత్య

తనపై అక్రమ కేసులు పెట్టారంటూ... ప్రసాద్ అనేక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగింది. దీంతో కుటుంబసభ్యులు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వైసీపీ నేతల ప్రోద్భలంతో.. పోలీసులు తప్పుడు కేసులు పెట్టారంటున్నారు. అందువల్లే దీనికి కారకులైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. పోలీసులు మాత్రం.. పశువును దొంగలించాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. 

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హాలహర్వి మండలం చింతకుంటలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగార్తులను బళ్లారి ఆసుపత్రికి తరలించారు. మృతులంతా... కర్ణాటకలోని శిడిగమనలకు చెందిన వారిగా గుర్తించారు. శిడిగమనల నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: నామా

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు.. తెలంగాణ పథకాలు బాగున్నాయంటూ.. దేశ మంతా అమలు చేసే మోదీ సర్కార్‌.. నిధుల విషయంలో మాత్రం మొండిచేయి చూపుతోందన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు.. నవోదయ విద్యాలయాలు, ఐటీఐఆర్‌, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని నామా మండిపడ్డారు. నీతి అయోగ్‌ సిఫారసు చేసినా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. 

బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్‌

బీజేపీ, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్‌. ధరలు పెంచిన బీజేపీ నేతల్ని నిలదీయాలన్నారు. 50 ఏళ్లు అధికారం ఇస్తే.. కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. కేసీఆర్‌ సారధ్యంలో నేడు తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు. బీజేపీ ఎంపీ అర్వింద్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. 70 ఏళ్ల వయస్సున్న కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు తిడతారా అని భగ్గుమన్నారు. రేవంత్ తెలంగాణ వాది కాదని.. తెలంగాణకు పట్టిన వ్యాధి అని కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కుంభకోణాలేనని అన్నారు. 

11 కార్లు, 27 బైకులు స్వాధీనం


హైదరాబాద్‌లో చోరీ వాహనాలు విక్రయిస్తున్న రెండు అంతరాష్ట్ర దొంగల ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో పది మందిని అరెస్ట్ చేశామని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఆరాంఘర్ చౌరస్తా దగ్గర తనిఖీల్లో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... విచారణ తర్వాత 11కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలన్నీ పుణె, ఢిల్లీ, హర్యానాలో చోరీ చేసినట్టుగా నిర్ధారించారు. ఒరిజినల్ నెంబర్ ప్లేట్లతో పాటు చేసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేసి విక్రయిస్తున్నారు. 
 

కుల వృత్తులను కాపాడుకునేందుకే  రూ. లక్ష ఆర్ధికసాయం

చితికిపోయిన కుల వృత్తులను కాపాడుకునేందుకే బీసీలకు లక్ష రూపాయాల ఆర్ధిసాయం అందజేస్తున్నామని చెప్పారు మంత్రి హరీష్‌రావు.. వృత్తిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 200 మంది లబ్ధిదారులకు మంత్రి హరీష్‌రావు చెక్కులు అందజేశారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా.. ఇప్పుడవి ఒక వేయి 12కు చేరాయంటే సీఎం కేసీర్‌ కృషి ఫలితమేనని చెప్పారు. త్వరలోనే సిద్దిపేటలో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.  

శిశు పాలుడిలా సీఎం జగన్‌ తప్పులు

శిశు పాలుడు తప్పుల్లాగా.. సీఎం జగన్‌ తప్పులను రాష్ట్ర ప్రజలు లెక్కబెడుతున్నారని.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 70 మంది టీడీపీ కార్యకర్తలను అన్యాయంగా జైల్లో పెట్టి వేధిస్తున్నా.. జగన్‌ కక్ష సాధింపు ఇంకా తీరలేదా అని ధ్వజమెత్తారు. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం జైళ్లుగా మార్చాల్సిందేనన్నారు. మరో పోరాటానికి తాము సిద్ధమన్నారు. 

వైసీపీ దాడులకు తెగబడితే.. టీడీపీపై కేసులు


పుంగనూరు ఘటనలో వైసీపీ దాడులకు తెగబడితే.. టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం ఏమిటని నల్లపాటి రాము ధ్వజమెత్తారు. పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. ఇక టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. యువగళం దెబ్బకు వైసీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ఈ కేసులకు భయపడేది లేదన్నారు. వైసీపీ నేతల్ని ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్నారు. ఏపీలో జరిగే అరాచకాలపై కేంద్రం స్పందించాలని కోరారు.

రాహుల్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న BJP మహిళా ఎంపీలు

రాహుల్‌గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాహుల్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా ఎంపీలు. అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన రాహుల్‌.. ఆ సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఫ్లైయింగ్‌ కిస్ ఇచ్చారని బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపించారు. స్మృతి ఇరానీ ప్రసంగిస్తున్న సమయంలో ఆమె పట్ల రాహుల్‌ అసభ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు బీజేపీ మహిళా ఎంపీలు. రాహుల్‌గాంధీ వీడియోను విడుదల చేయాలని స్పీకర్‌ను కోరారు.

మణిపూర్ లో భారత మాతను హత్య చేశారు - రాహుల్

మణిపుర్‌ అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీనే లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రెండోరోజు చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చర్చను ప్రారంభించి ప్రసంగించారు. దేశాన్ని మణిపుర్‌లో హత్య చేశారంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు.. దేశ ద్రోహులన్న ఆయన...వాళ్లు భరతమాత రక్షకులు కాదని హంతకులంటూ మండిపడ్డారు.  

రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి స్మృతి

రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. మీరు భారత్‌ కు కాదు... అవినీతికి ప్రతిరూపమంటూ రాహుల్ పై మండిపడ్డారు. మణిపూర్ దేశంలో అంతర్భాగమేనన్న ఆమె...మణిపూర్‌ను ఎవరూ విభజించలేరంటూ ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి శాంతి నెలకొల్పామని... కానీ కాంగ్రెస్ వాళ్లు అక్కడికి వెళ్లి మళ్లీ 370 తెస్తామంటున్నారంటూ మండిపడ్డారు. భారత మాతను హత్య చేశారని రాహుల్ అంటుంటే... కాంగ్రెస్‌ సభ్యులు చప్పట్లు కొట్టడేమంటని ప్రశ్నించారు.  

అంగళ్లులో నాపై హత్యాయత్నం చేశారు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.అంగళ్లులో తన పైనే హత్యాయత్నం చేశారని,సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే హత్యాయత్నం జరిగిందన్నారు.అంగళ్లు ఘటనపై సీబీఐ విచారణకు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అంగళ్లుకు చేరుకునేలోపే 5 వేల కోట్ల స్కామ్‌ను బయటపెట్టానన్న చంద్రబాబు..అంగళ్లులో తనని చంపాలనే వైసీపీ వాళ్లు వచ్చారని అన్నారు. నాపైనే హత్యాయత్నం చేసి.. నా పైనే కేసు పెడతారా? అంటూ ప్రశ్నించారు.సైకో చెప్పాడు కాబట్టి మంత్రి పెద్దిరెడ్డి,అతడి తమ్ముడు దాడికి ప్రయత్నించారని అన్నారు.తనపై చాలాసార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్‌ చేశారని ఎక్కడికి వెళ్లిన దాడి చేస్తున్నారని అన్నారు. 

ఆదుకున్నందుకు కేసీఆర్‌కు పిండం పెడతావా?- జగదీష్ రెడ్డి


రేవంత్ రెడ్డిపై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్‌కు పిండం పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్సించారు. కరెంట్,నీళ్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెట్టిన పార్టీ నుంచి రేవంత్ వచ్చారంటూ విమర్శించారు. అందరిని ఆదుకుంటున్న కేసీఆర్‌కు పిండం పెడతావా అంటూ ప్రశ్నించారు. ఆంధ్ర తొత్తులకు తెలంగాణ అస్థిత్వాన్ని తాకట్టుపెట్టారంటూ రేవంత్ పై ఫైర్‌ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి.