- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

డిప్యూటీ సీఎం నారాయణస్వామికి.... ఎక్కడికి వెళ్లినా నిరసన సెగలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు జనం ఆయన్ను అడ్డుకుంటే, ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం గుంటిపల్లె గ్రామంలో జరిగింది. మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గీయుల మధ్య రాజకీయ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పెనుమూరు మండలంలో పర్యటిస్తున్న నారాయణస్వామిని తమ గ్రామానికి రావద్దంటూ.. గుంటిపల్లెకు వెళ్లే మార్గంలో వైసీపీ నేతలు, ముళ్ల కంచె, రాళ్లను అడ్డుగా పెట్టారు. దీంతో అసహనానికి గురైన నారాయణస్వామి.. వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. అయితే వైసీపీ కార్యకర్తలు మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కావడంతోనే నారాయణస్వామి పొర్లుదండాలు పెట్టి ఓట్లు అడుక్కునేందుకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆయన తమ గ్రామానికి రావాల్సిన అవసరంలేదన్నారు వైసీపీ కార్యకర్తలు. ఆయన వస్తున్నారని తెలుసుకున్న యువకులు గ్రామానికి ఇరువైపులా ఉన్న మార్గాల్లో ముళ్లకంపలు, రాళ్లు అడ్డంగా పెట్టారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ నిరసన చేశారు. చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.

విశాఖ గోపాలపట్నంలో ఆత్మహత్యకు పాల్పడిన యువతి కేసు మరో మలుపు తిరిగింది.పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు,సూర్యప్రకాష్ అనే యువకుడిని ప్రేమిస్తూ,మరో యువకుడు లంకా సాయి కుమార్ను పెళ్లిచేసుకుంది షేక్ కరిష్మా.ఇద్దరూ వచ్చి కరిష్మాను నిలదీయడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది. మరోవైపు భయంతో రైలు కిందపడి ప్రియుడు సూర్యప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరిష్మా భర్త సాయికుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.

విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం గాజువాక నియోజకవర్గంలో పవన్ పర్యటన కొనసాగుతోంది. పాత గాజువాకలోని వుడా రోడ్డులో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. గాజువాక శ్రీకన్య థియేటర్ కూడలి నుంచి, బహిరంగ సభ వరకు వారాహి పై పవన్ కళ్యాణ్ రోడ్ షో ఉంటుంది. కాన్వెంట్ జంక్షన్, సిందియా, మల్కాపురం, శ్రీహరిపురం మీదగా పాత గాజువాక వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు జనసేన నేతలు..

విపక్షాలపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. కావాలనే సమస్యలు సృష్టించి వాటి ద్వారా రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ రాజకీయాలలో కేసీఆర్ పెనుమార్పులు తీసుకురాబోతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో రెండో రోజు పలెనిద్ర కార్యక్రమలో పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో... ఎమ్మెల్యే రెడ్డి శాంతికి నిరసన సెగ తగిలిగింది. పెద్దమల్లిపురం గ్రామంలో... గడప గడప ప్రభుత్వం కార్యక్రమంలో... ఆయన్ను అడ్డుకున్నారు మహిళలు. నాలుగేళ్లుగా రానిది.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని వచ్చారంటూ.... మండిపడ్డారు. తమ ఊరికి డ్రైనేజి వ్యవస్థ, రోడ్లు, మంచినీటి కొళాయిలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల వచ్చినప్పుడే .. ఓట్ల కోసం ఊళ్లకు వస్తారా అంటూ ప్రశ్నించారు. మహిళలకు సమాధానం చెప్పలేక.... అక్కడినుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే రెడ్డి శాంతి.

తెలంగాణ సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చి నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రార్థనా మందిరాలను ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకేసారి ప్రారంభించనున్నారు.ఆగస్టు 25న ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మూడు మతాలకు సంబంధించిన మత గురువుల సమక్ష్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని ప్రారంభించనున్నారు. సచివాలయంలో విధులు నిర్వహించే వివిధ వర్గాలు ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఇక్కడే ప్రార్థనలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ మూడు నిర్మాణాలను చేపట్టారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన గంగా జమునా తెహజీబ్కు ప్రతీకగా ఇవి నిలువనున్నాయి
ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులు, ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో సమావేశమై ఆలయాల ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసినట్లు సమాచారం.ఈ నెల 25న పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అదే రోజు, కేసీఆర్ మసీదు, చర్చిలను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మత పెద్దలు హాజరుకానున్నారు. సిబ్బందికి మూడు ప్రార్థనా స్థలాల్లో ప్రవేశం ఉంటుంది.

జగన్ సర్కారు... వర్షాకాలంలోనూ రైతులకు సాగునీరు అందించలేని అసమర్ధ ప్రభుత్వమంటూ మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మద్దిపాటి వెంకటరాజు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం, ఆనుముని లంక ,సుభద్ర పాలెం తదితర గ్రామాల్లోని పోలాలను టీడీపీ నేతలతో కలసి పరిశీలించారు. తాడిపూడి లిఫ్ట్ పరిధిలో సాగునీరు విడుదల చేయకపోవడంతో 300 ఎకరాల్లో ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతో కలిసి నినాదాలు చేశారు. తక్షణమే రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్కు ఘన స్వాగతం లభిస్తోంది. లోకేష్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తల తోపాటు ప్రజలు, అభిమానులు అడుగులో అడుగు వేస్తున్నారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా నారా లోకేష్.. వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు.
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ 183వ రోజు సిరిపురం శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సిరిపురంలో స్థానికులతో సమావేశమయ్యారు యువనేత. కాసేపట్లో వరగానిలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముచ్చటించనున్నారు యువనేత.
సాయంత్రం 4గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది.రావెల శివార్లలో అమరావతి ఆవేదన కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు.జై టీడీపీ, జై లోకేష్ నినాదాలతో దద్దరిల్లింది తాడికొండ.లోకేష్ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రజలు. ఆయన కోసం దారిపొడవునా బారులు తీరి ఎదురు చూస్తున్నారు జనం.

హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఆటోనగర్లోని హ్యుందాయ్ షోరూంలో గుండెపోటుతో మెకానిక్ మృతి చెందాడు.కార్ రిపేర్ చేస్తుండగా కుప్పకూలి..హార్ట్ ఎటాక్తో అక్కడిక్కడే మృతి చెందాడు అబ్దుల్లాపూర్ మెట్ కోహెడకు చెందిన జంగారెడ్డి గత కొంత కాలంగా హ్యుందాయ్ షోరూంలో పనిచేస్తున్నాడు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. జంగా రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, హ్యుందాయ్ షోరూం సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.

వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు టీడీపీ నేత కేసినేని చిన్ని. లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 19న ఎన్టీఆర్ జిల్లాలో అడుగుపెడుతుండటంతో... స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్ర నిర్విఘ్నంగా జరగాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మరోసారి చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. చిత్తూరులో ప్రారంభమైన యువగళం పాదయాత్ర.... కృష్ణా జిల్లాలో అడుగుపెడుతోందన్న ఆయన.... జగన్ ప్రభుత్వానికి లోకేష్ రెడ్డి అలర్ట్ జారీ చేశారన్నారు.

ఏలూరు జిల్లా ద్వారాక తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయంలో.... ఆక్టోపస్ బలగాలు హడావుడి చేశాయి. ఆలయంలో ఉగ్రవాదులు దాడులు చేస్తే.. తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై మాక్ డ్రిల్ చేశారు. ప్రతికూల పరిస్థితుల్ని ఎలా తిప్పికొట్టాలన్న అంశాలపై.. అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్లో బలగాలతో పాటు దేవస్థానం అధికారులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఉగ్రదాడులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై.. ఈ డ్రిల్ నిర్వహించారు.

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని పల్లిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనాన్ని ఈవీఎంలతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాద వేగానికి డీసీఎం వాహనం పల్టీ కొట్టింది. హైదరాబాద్ నుండి బెంగాల్కు ఈవీఎంలను తీసుకెళ్తుండగా.. లారీ వెంట నాలుగు ఎస్కార్ట్ వాహనాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న ఎలక్షన్ సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని హారతిరెడ్డి సూసైడ్ చేసుకుంది.భర్త సంతోష్రెడ్డి తోపాటు అత్తమామల వేధింపులతోనే..హారతి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు.సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు హారతి భర్త సంతోష్.అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులపై హత్య కేసు నమోదు చేయాలంటూ పోలీస్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

పట్టిసీమపై జగన్ సర్కార్ యూ టర్న్ తీసుకుంది.గోదావరి నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నా..ఇన్నాళ్లూ చోద్యం చూసిన వైసీపీ సర్కార్ విధిలేని పరిస్థితుల్లో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణకు తరలించింది.ఈ సీజన్లో దాదాపు 1,400 టీఎంసీల గోదావరి జలాలు వృథా అయినా పట్టించుకోకుండా కోట్ల ప్రజాధనం వృథా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పట్టిసీమను వాడటం అనివార్యమంటూ మోటర్లను ఆన్ చేసింది. శనివారం పట్టిసీమ నుంచి రెండు టీఎంసీలకుపైగా నీటిని వదిలింది.

సిద్దిపేట జిల్లాలో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టైంది. రైస్ పుల్లింగ్ కలశంతో అద్భుతాలు సృష్టిస్తామని నమ్మిస్తూ మోసాలు చేస్తోంది ఓ ముఠా. సుబ్బారెడ్డి అనే వ్యక్తి… రైస్ పుల్లింగ్ కలశాన్ని కొనేందుకు ప్రకాశం జిల్లా నుంచి చేర్యాలకు వచ్చాడు. 10 లక్షల 75 వేలు ఇచ్చి కలశం చూపెట్టాలని అడిగాడు. అయితే... మిగిలిన డబ్బులు ఇస్తేనే చూపిస్తామన్న నిందితులు.. చివరికి ఇన్నోవాలో పారిపోయారు. మోసపోయానని గ్రహించిన సుబ్బారెడ్డి….. చేర్యాల పీఎస్లో ఫిర్యాదు చేశాడు . ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలో నిందితులను పట్టుకున్నారు పోలీసులు.

తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత ఏ. చంద్రశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు.బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు.తెలంగాణ సర్కార్ అన్యాయాలను కేంద్ర అడ్డుకోవడంలేదంటూ లేఖలో పేర్కొన్నారు.అయితే అయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.ఈ నెల 18న ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపారు. వికారాబాద్ నియోజక వర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రశేఖర్.

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరు ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది.. ఇందులో భాగంగా ఈనెల 16, 17 తేదీల్లో బస్తీల్లో పర్యటించాలని పార్టీ నేతలకు కిషన్రెడ్డి సూచించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు. ఈనెల 18న పేదలతో కలిసి మండల కేంద్రాల్లో.. 23, 24న కలెక్టరేట్ల ఎదుట ఆందోళన నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 4న హైదరాబాద్లో విశ్వరూప మహాధర్నాకు సిద్ధం కావాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే .. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయన్నారు కిషన్రెడ్డి.

తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డికి మంత్రి హరీష్రావు సవాల్ విసిరారు. బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టలేదని.. రాష్ట్రానికి రావాల్సిన 35వేల కోట్లను కేంద్రం ఆపింది నిజం కాదా అని ప్రశ్నించారు. నిజం కాకపోతే మీటర్లు పెట్టిన పక్క రాష్ట్రాలకు డబ్బులు ఎలా ఇచ్చారని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఎందుకు ఆపారో కిషన్రెడ్డి చెప్పాలన్నారు. ఒకరేమో 3 గంటల కరెంట్ చాలంటారు.. ఇంకొకరేమో మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారని హరీష్రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాత్రం 3 పంటలు పండాలని కోరుకుంటున్నారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ అన్నింటిని అమ్మేసి చేనేతలను ఇబ్బంది పెడుతుంటే.. తమ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు. పోచంపల్లి చేనేత పార్క్ని పునరుద్ధరించి నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. పోచంపల్లి నేతన్నలు చేనేతల అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు. భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ హ్యాండ్లూమ్ పార్కుకు శంకుస్థాపన చేసి చేనేత వారోత్సవ సభలో పాల్గొన్నారు.

తెలంగాణలో 30శాతం వాటాల ప్రభుత్వం నడుస్తోందని కిషన్రెడ్డి ఆరోపించారు. దళితబంధు పేరుతో కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పొదుపు సంఘాల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే... పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తాయన్నారు. నాలుగునెలల్లోనే ప్రగతిభవన్ కట్టుకున్న కేసీఆర్కు పేదల ఇళ్లపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరిగిన మహాధర్నాలో కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శల చేశారు.

వైసీపీ ప్రభుత్వం తమపై మొండి వైఖరితో ముందుకు వెళుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, జీవో నెంబర్ 117 రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తమ సమస్యల కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వాపోయారు.

తెలంగాణ ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ గమ్యంను ప్రారంభించారు TSTRC ఎండీ సజ్జనార్. ప్రజల వద్దకు ఆర్టీసీ కొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తుందన్నారు. మహిళల భద్రతకు గమ్యం యాప్ ఉపయోగపడుతుందని..యాప్లో ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అద్భుతంగా ఉందని అన్నారు. రాత్రివేళ బస్ స్టాప్లు లేని ప్రాంతాల్లో యాప్లో సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని అన్నారు. పల్లె వెలుగు తప్ప అన్ని ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందన్నారు సజ్జనార్.

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గర్భాలయం దర్శనం చేయిస్తామంటూ..భక్తులను మోసం చేస్తున్న దళారుల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.పదిహేను వందలు ఇస్తే గర్భాలయం దర్శనం చేయిస్తాము అంటూ భక్తులను మోసం చేస్తున్నారు కొందరు దళారులు.ఇలా ఆలయానికి వచ్చిన భక్తులు అడుగున దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దళారుల అవతారంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా పాలక వర్గం పట్టించుకొవడం లేదని భక్తులు మండిపడుతున్నారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గంలో MROపై వైసీపీ నేత జులుం పదర్శించారు. కొండాపురం మండల MROని నలుగురి ముందు ఏకంగా అన్ ఫిట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజ్గోపాల్ రెడ్డి.మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా పిర్యాదులు రావడంతో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తహశీల్దారును పిలిపించి మీలాంటి అధికారిని ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.మీకు అభ్యంతరం ఉంటే చెప్పండి.. జిల్లా కలెక్టర్ కు చెప్పి మరో ఎమ్మార్వోను తెచ్చుకోండి అంటూ సమాధానం ఇచ్చారు.

హైదరాబాద్లోని నిజాం కాలేజీ లో బాయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్ ను మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. యూనివర్సిటీల పరంగా తెలంగాణకు నాలుగవ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఓయూ అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. వర్సిటీ వీసీ రవీందర్ కూడా ఓయూ అభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రారంభించిన కార్యక్రమం బాగుందన్నారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ లోకేష్కు ఘన స్వాగతం లభిస్తోంది.లోకేష్ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రజలు.దారిపొడవునా బారులు తీరుతున్నారు జనం.పసుపు మయంగా మారింది లగడపాడు గ్రామం.దారి పొడవునా పూల దారి ఏర్పాటు చేసి పూలపై లోకేష్ ను నడిపించి తమ అభిమానం చాటుకున్నారు

చిన్నారి లక్షిత పోస్టుమార్టం పూర్తి అయింది.రూయా ఆస్పత్రి మార్చురీలో పంచనామా చేసి..మృత దేహాన్ని లక్షిత స్వస్థలం పోతిరెడ్డిపాడుకి ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు టీటీడీ అధికారులు.చిరుత దాడిలోనే లక్షిత మృతి చెందనట్లు పోస్టుమార్టం నివేదికలో తెలిపారు.చిరుత దాడిగానే చిన్నారి తండ్రి దినేష్ కుమార్ కూడా నిర్థారించారు. శుక్రవారం రాత్రి అలిపిరి నడక మార్గంలో రాత్రి తప్పిపోయిన లక్షిత.. ఇవాళ ఉదయం లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర విగత జీవిగా కనిపించింది. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కరీంనగర్లో ఎలుగు బంటి హల్చల్ చేసింది. శివారు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి నడిరోడ్డుపై ప్రత్యక్షం కావడంతో శ్రీపురం, రజ్వీ చమన్ వాసులు అప్రమత్తమయ్యారు. అటవీఅధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో స్థానిక యువత కర్రలు పట్టుకుని గస్తీ చేపట్టారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఎలుగుబంటి వెళ్లిపోవడతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఉదయం రేకుర్తిలోని పలు కాలనీల్లోనూ ఎలుగుబంటి సంచరించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎలుగు బంటికి మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు.

హైదరాబాద్లో మరో ప్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది.ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్డు, వీఎస్టీ మీదుగా అజామాబాద్ వరకు చేపట్టిన బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. 2.8 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి.జీహెచ్ఎంసీ పరిధిలోని ఈ అత్యంత పెద్ద కట్టడానికి దాదాపు రూ. 450 కోట్లు కేటాయించారు. స్ట్రాటజికల్ రోడ్స్ డెవలప్మెంట్ లో భాగంగా ఎస్ఆర్టీపీ వంతెన రూపొందించారు. ఈ వంతెన 26.54 మీటర్ల ఎత్తు లో నిర్మించారు. ఈనెల ఆఖరులో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామంలో ఎటువైపు చూసిన కోతులే దర్శనమిస్తున్నాయి. వందల సంఖ్యలో ఒకేసారి ఇళ్లపై దాడి చేస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లోని ఆహారం కోసం కోతులు ఎగబడుతున్నాయని గ్రామస్ధులు అంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దర్శకుడు ఆర్జీవీపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది సినీ ప్రముఖులను చూశాము... కానీ బరితెగించిన మృగం లాంటి రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడిని ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతూ మరో సినిమా తీస్తున్నాడని ఫైర్ అయ్యారు. జగన్ గొప్ప నీతి మంతుడులాగా సినిమా తీస్తారా అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ధ్వజమెత్తారు.

పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్లో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన..వృద్ధురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని వైసీపీ అరాచకాలను కేంద్రం దృస్టికి తీసుకువెళుతామన్నారు పవన్. ఉత్తరాంధ్రను జగన్ దోచేస్తున్నారని విశాఖలో ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు చట్టాలను కాపాడాల్సిన సీఎం అతిక్రమిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఇద్దరు మహిళల అదృశ్యం సంచలనం రేపుతోంది. ఆస్పత్రికి వెళ్తున్నానని రాళ్లగూడలోని ఇంటి నుంచి బయటకు వెళ్లిన వడ్ల మంజుల అదృశ్యమైంది. శంషాబాద్ మండలం మదనపల్లి నుండి డ్యూటీకని బయలుదేరి కృష్ణమోని అఖిల అదృశ్యమైంది. దీంతో.. ఇద్దరు మహిళల బంధువులు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్తో పాటు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్లోని శ్రీనివాస ఎన్క్లేవ్లో దారుణ హత్యకు గురైన మహిళ వడ్ల మంజుల అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అర్హులైన పేదలు, లబ్దిదారులకు డబుల్ బెడ్రూం కల నెరవేరడం లేదంటోంది బీజేపీ.డబుల్ బెడ్రూం ఇళ్లపై పోరుబాట సాగిస్తున్న బీజేపీ ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా నిర్వహిస్తోంది.పేదలకు డబుల్బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడంపై..ఆందోళనకు పిలుపునిచచ్చారు.కేంద్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులను ఇస్తుంటే రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టింస్తోందని మండిపడుతున్నారు. వేల డబుల్ బెడ్రూంల నిర్మాణానికి అనుమతి పొందినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదంటున్నారు.

అనంతపురం జిల్లాలో రైతుల అనధికారిక క్రాప్ హాలిడేని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా దాదాపు 25 లక్షల హెక్టార్లకు పైగా సాగు అయ్యేది. కానీ ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4 లక్షల హెక్టార్లు కూడా పంటలు సాగు అయినట్టు నమోదు కాలేదు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు... మరొకవైపు ప్రభుత్వ సహాయ నిరాకరణే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణంగా రైతులు చెపుతున్నారు.

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీ అయిపోయారు.బెంగళూరు బెల్ కంపెనీ నుండి ఐదు భారీ వాహానాల్లో ఈవీఎంలు తిరుపతి చేరుకున్నాయి.2వేల212 పోలింగ్ కేంద్రాలకు సంబందించి దాదాపు 6వేల450 ఈవీఎంలను తరలించారు.రేణిగుంటలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ ల్లో ఈవీఎంలను భద్రపరిచారు.డీఆర్వో కోదండరామిరెడ్డి సమక్షంలో భారీ భద్రత నడుమ ఈవీఎంలను పర్యవేక్షించారు. ఈవీఎంలను వైసీపీ నేత ప్రభాకర రెడ్డి, టీడీపీ నేత నర్సింహా యాదవ్ పరిశీలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


